Friday, May 10, 2024

కారు, బైక్ ఢీ ముగ్గురి మృతి.. వికారాబాద్ లో ఘటన

వికారాబాద్‌, ప్రభ న్యూస్‌ : కారు ద్విచక్ర వాహనం వేగంగా డీ కొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆస్పత్రిలో మరణించిన సంఘటన వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌ మండలం గొట్టిముకుల గేటు వద్దగల మూల మలుపులో గురువారం చోటు చేసుకుంది.అతివేగం కారణంగా ఈ సం ఘటన జ రిగినట్లు పరిశిలకులు బావిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పరిగి మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన ఖాజా,మోహన్‌,అంజయ్యలు సెంట్రిం గ్‌ పనినిమిత్తం వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి వస్తున్న సమయంలో వికారాబాద్‌ నుండి పరిగి వైపు వేగంగా వెలుతున్న కారు బలంగా డీ కొట్టడంతో వాహనం పై ఉన్న ఖాజా,మోహన్‌ అకడికక్కడే మరణించారు.తీ వ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న అంజయ్యను ఆస్నత్రికి తరలించగా చికిత్స పొందుతు మరణించాడు.

ఇరు వాహానాలు 100 కిలో మీటర్ల వేగం కి పైగా వెలుతుండటం మూల మలుపు ఉండటం ప్రమాదానికి కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.విషయం తెలుసుకున్న పోలిసులు హుటా హుటిన సంఘటన స్ధలానికి వెల్లి క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు.నిత్యం సెంట్రింగ్‌ పని నిమిత్తం వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చే వారు నిత్యం ఒక చోట పని చేసి కుటుంబాన్ని పోషించుకునే వారు.కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వారు కోల్నోవటంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ప్రభుత్వం మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement