Friday, May 10, 2024

ఉత్తరాఖండ్‌లో పది రోజుల్లో 1000 మందికిపైగా చిన్నారులకు కరోనా..

కరోనా సెకండ్ వేవ్ పిల్లలపై పంజా విసురుతోంది. ఉత్తరాఖండ్‌లో పది రోజుల్లో ఏకంగా వెయ్యిమందికిపైగా చిన్నారులు కరోనా బారినపడడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగానూ చిన్నారుల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మన దేశంలో టీకా అందుబాటులో ఉంది. ప్రస్తుతం పలు సంస్థలు చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అవి విజయవంతమైతే 18 ఏళ్ల లోపు వారికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

ఇక కరోనా బాధిత చిన్నారులందరూ 9 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. చిన్నారుల్లో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్ 1-15 మధ్య 264 మంది చిన్నారులకు కరోనా సంక్రమించింది. ఆ తర్వాత వ్యాప్తి క్రమంగా పెరిగింది. ఏప్రిల్ 16-30 మధ్య 1,053 మందికి వైరస్ సోకింది. ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య మరో 1,618 మంది చిన్నారులు ఈ మహమ్మారి బారినపడినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రభుత్వం మాత్రం గత ఏడాది కాలంలో 2,131 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement