Wednesday, April 24, 2024

కదులుతున్న రైలు ఎక్కేందుకు జవాన్‌ యత్నం, నెట్టేసిన టీటీఈ.. రెండు కాళ్లు కట్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దిబ్రూగఢ్‌ నుంచి ఢిల్లి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలును ఓ జవాన్‌ ఎక్కుతుండగా టీటీఈ తోసేశాడు. దీంతో జవాన్‌ అదుపుతప్పి రైలు కింద పడిపోయాడు. ఈ ఘటనలో సైనికుడి రెండు కాళ్లు తెగిపోయాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ లాగి రైలును ఆపేశారు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారకుడైన టీటీఈపై చర్యలు తీసుకోవాలని సైనికులు, ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న సివిల్‌ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులను అదుపుచేసి రైలును పంపించారు. ఈ తరుణంలోనే టీటీఈ అక్కడి నుంచి ఉడాయించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు టీటీఈ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement