Saturday, September 21, 2024

హాస్టల్ లో ఉండే బాలిక మిస్సింగ్..

నర్సంపేట, ఫిబ్రవరి 16,(ప్రభ న్యూస్) : పట్టణ కేంద్రంలోని ఓ వసతి గృహంలో ఉండి దగ్గరలో ఉన్న పాఠశాలలో 8వ తరగతి చదివే బాలిక తప్పి పోయినట్లు సమాచారం. అయితే సమాచారం మేరకు వసతి గృహం వార్డెన్ రమను అడగగా తప్పిపోయిన విషయం వాస్తవమని, సాయంత్రం వసతి గృహంలో పిల్లల హాజరు సమయంలో సదరు బాలిక కనబడక పోయేసరికి విచారణ చేయగా.. చదివే పాఠశాలలో మధ్యాహ్న సమయంలో వసతి గృహానికి వెళ్తున్న అని తోటి విద్యార్థినులతో చెప్పినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సైతం అందజేసినట్లు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం పై సీఐ పులి రమేష్ గౌడ్ ను వివరణ కోరగా ఇంకా మా దృష్టికి రాలేదని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement