Friday, May 17, 2024

TS | దేశంలోని తొలి ఎపిగ్రఫీ మ్యూజియం హైదరాబాద్‌లోనే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. రేపు (సోమవారం) కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియానికి శంకుస్థాపన జరగనుంది. భారత పురాతత్వ శాఖ – హైదరాబాద్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ మ్యూజియం ఏర్పాటు కానుంది. 2023-24 బడ్జెట్‌లో మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

మ్యూజియం ఏర్పాటయ్యేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జియంలో లక్షకు పైగా ప్రాచీన శిలాశాసనాలు, లోహాలపై, చెక్కలపై చెక్కిన శిల్పాలను, వాటి డిజిటలైజేషన్ పూర్తిచేసి ఈ ఎపిగ్రఫీ మ్యూజియం ద్వారా సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు. మల్టీ మీడియా ద్వారా సందర్శకులు ఆయా శాసనాల్లోని అంశాలను తెలుసుకోవచ్చు.

- Advertisement -

భారతదేశంలో రాత, శాసనాల పుట్టుపూర్వోత్తరాలు మొదలుకుని, వివిధ భారతీయ భాషల్లో మన పూర్వీకులు ఇచ్చిన సందేశాలు, పేర్కొన్న అంశాలు, వివిధ రాజుల సమయాల్లోని విశేషాలు.. వంటివెన్నో ఈ ఎపిగ్రఫీ మ్యూజియం సందర్శన సందర్భంగా అనుభవంలోకి రానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సాలార్జంగ్‌ మ్యూజియంలోని వెస్టర్న్‌ బ్లాక్‌ వద్ద ఎపిగ్రఫీ మ్యూజియానికి శంకుస్థాపన చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement