Monday, April 29, 2024

Bus Accident: బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ముంబై వెళ్తున్న ప్రైవేటు బస్సు అర్ధరాత్రి సమయంలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో ప్రమాదానికి గురైంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కన బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.

దీంతో ప్రయాణికులు క్షణాల్లోనే బస్సును ఖాళీ చేశారు. ఆ వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రయాణికుల లగేజీలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement