Friday, April 26, 2024

క్రిఎ్టో ట్రేడింగ్‌పై పన్ను తగ్గించాలంటూ ప్రభుత్వానికి క్రిఎ్టో పరిశ్రమ విజ్ఞప్తి..

న్యూఢిల్లి : క్రిఎ్టో కరెన్సీలో ట్రేడింగ్‌ చేయడం ద్వారా వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌ను ప్రతిపాదిత 1 శాతం నుంచి 0.01 శాతం లేదా 0.05 శాతానికి తగ్గించాలని భారత్‌ క్రిఎ్టో పరిశ్రమ కోరుతున్నది. ఒక టీడీఎస్‌ రిటైల్‌ వ్యాపారులు ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. క్రిఎ్టో ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువ అని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్‌ డీసీఎక్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్‌ గుప్తా తెలిపారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్‌ఫాంలోని వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

క్రిఎ్టోపై మరింత పన్ను వడ్డించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. క్యాసినో, బెట్టింగ్‌, లాటరీలతో పాటు క్రిఎ్టోపై 28 శాతం జీఎస్‌టీ విధించాలని జీఎస్‌టీ మండలి భావిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే జీఎస్‌టీ మండలిలో ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే.. క్రిఎ్టో మైనింగ్‌తో పాటు వాటి క్రయ, విక్రయాలపై 28 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో క్రిఎ్టో పెట్టుబడులపై ప్రభుత్వం ఇప్పటికే వివిధ రకాల పన్నులు విధిస్తోంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి క్రిఎ్టోలు, నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ) వంటి డిజిటల్‌ ఆస్తుల్లో పెట్టుబడులపై ఆర్జించే లాభాలపై 30శాతం ఆదాయం పన్నుతో పాటు సెస్‌, 15 శాతం సర్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ప్రభుత్వం క్రిఎ్టో లాభాలను సైతం గుర్రపు పందేలు, ఇతర గ్యాంబ్లింగ్‌ కార్యకలాపాల్లో ఆర్జించిన లాభాల్లాగే పరిగణించనుంది. అయితే క్రిఎ్టో లాభాలపై భారాన్ని తగ్గించాలని క్రిఎ్టో పరిశ్రమ కోరుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement