Tuesday, May 14, 2024

ఎరువుల కోసం కేంద్ర‌మంత్రికి లేఖ‌..’నిరంజ‌న్ రెడ్డి’..

కేంద్ర ఎరువులు,ర‌సాయ‌నాల‌శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండ‌వీయికి తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కోరారు. అక్టోబరు, నవంబరు నెలలకు 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కేటాయించింది. అయితే ఇప్పటివరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేసింది. అయితే కేటాయింపుల ప్రకారం 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని, వెంటనే సరఫరా చేయాలని కేంద్ర మంత్రికి లేఖ రాశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement