Tuesday, April 30, 2024

Syria Blast : ప్రార్థనా మందిరంలో పేలుడు… ఆరుగురు మృతి

ఓ ప్రార్థ‌నా మందిరంలో పేలుడు ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో ఆరుగురు మృతిచెంద‌గా, మ‌రో 20మందికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న‌ సిరియాలో సంభవించింది. రాజధాని డమాస్కస్ సమీపంలోని ఓ ప్రార్థనా మందిరంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సిరియాలో అత్యధికంగా సందర్శించే షియా పుణ్యక్షేత్రమైన సయేదా జైనాబ్ సమాధి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్యాక్సీలో బాంబు పెట్టడం వల్ల ఈ పేలుడు సంభవించిందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది ఉగ్రవాదుల పనే అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement