Saturday, July 27, 2024

Suresh Gopi – కేంద్ర మంత్రి ప‌ద‌విని వదిలివేస్తా….కేరళ హీరో సంచలన నిర్ణయం

ప్ర‌ధాని మోడీ 3.0 ప్ర‌భుత్వంలో కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన త్వరలోనే ఆ పదవి నుంచి రిలీవ్ అవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. తాను మంత్రి పదవి అడగలేదని సురేష్ గోపి అన్నారు. మంత్రి పదవిని వదులుకోవడానికి గల కారణాన్ని సురేష్ గోపి వివరిస్తూ.. ‘నేను చాలా సినిమాలకు సైన్ చేశాన‌ని, వాటిని చేయాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని చెప్పారు.. సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉండే తాను మంత్రి ప‌ద‌వికి న్యాయ చేయ‌లేన‌ని నిరాశ వ్య‌క్తం చేశారు.. అయితే త్రిసూర్ ఎంపీగా కేర‌ళ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని చెప్పారు.. త్రిసూర్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పాడు. అక్కడి ప్రజలతో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు.

కేర‌ళ‌లో తొలిసారి క‌మ‌ల వికాసం..
2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ తొలిసారిగా ఖాతా తెరిచింది. సురేష్ గోపి త్రిసూర్ నుండి బిజెపి టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించి చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. ఈ స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పోటీ చేసిన వీఎస్ సునీల్ కుమార్ 74,686 ఓట్ల తేడాతో సురేష్ గోపీ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యే ముందు సురేష్ గోపీ 2022 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సురేష్ గోపి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుపరిచితుడు… చాలా పెద్ద చిత్రాలలో కనిపించాడు. ఇది కాకుండా, అతను అనేక టీవీ షోలకు హోస్ట్‌గా కూడా ఉన్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement