Tuesday, April 16, 2024

భార‌త్ లో బిబిసి నిషేధం – హిందూ సేన పిటిష‌న్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు..

న్యూఢిల్లీ – భారత్‌లో బీబీసీని నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002లో గోద్రా ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ పాత్రను విమర్శనాత్మకంగా చూపించింది బీబీసీ మీడియా సంస్థ. ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్​’ పేరుతో రెండు ఎపిసోడ్​ల సిరీస్‌ను బీబీసీ రూపొందించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ ప్రభుత్వం దీని ప్రసారంపై నిషేధం విధించింది. ఈ నేప‌థ్యంలో బీబీసీ, బీబీసీ ఇండియాను బ్యాన్‌ చేయాలంటూ హిందూ సేన సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిల్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒక డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. ఒక ఛానల్‌ను బ్యాన్‌ చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు ఎలా జారీ చేస్తుంది’’ అంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement