Friday, May 3, 2024

AP: శివశంకర్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయండి.. సునీత పిటిష‌న్

వివేకా హ‌త్య కేసులో నిందితుడు ..
ప్ర‌స్తుతం బెయిల్ పై బ‌య‌ట‌కు
ర‌ద్దు కోరుతూ సుప్రీంకోర్టులో సునీత పిటిష‌న్..

ఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం విచార‌ణ‌కు స్వీక‌రించింది..విచారణ‌ను ఈనెల 22వ‌తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement