Wednesday, May 1, 2024

Pakistan – బలూచిస్థాన్‌లోని మ‌సీదులో ఆత్మ‌హుతి దాడి… 52 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఆత్మ‌హుతి దాడి జ‌రిగింది… శుక్ర‌వారం నాడు అత్య‌ధిక సంఖ్య‌లో ప్రార్ధ‌న‌లు చేస్తున్న ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు పాక్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. పేలుడు విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసులు, సైన్యం ,వైద్య సిబ్బంది అక్క‌డికి చేరుకున్నాయి.. గాయ‌ప‌డిన అనేక‌మందిని చికిత్స‌కోసం స‌మీపంలోని ఆస్ప‌ట‌ల్స్ కు త‌ర‌లించారు.. ఈ బాంబుదాడికి చేసింది ఎవ‌రో ఇంత‌వ‌ర‌కు ఏ సంస్థ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement