Friday, April 19, 2024

బాయ్‌ఫ్రెండ్ కోసం నడిరోడ్డుపై త‌న్నుకున్న విద్యార్థినులు!

ప్రియుడి కోసం విద్యార్థులు న‌డిరోడ్డుపై జుట్టు ప‌ట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన చెన్నైలోని పెరంబూర్‌‌లో తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదురామకృష్ణాపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్లన్ వన్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై గొడ‌వ‌ప‌డ్డారు. వారిలో ఓ బాలిక తన సహచర విద్యార్థితో ప్రేమాయణం నడుపుతోందని తెలుస్తోంది. తన ప్రియుడికి మరో బాలిక వాట్సాప్ మెసేజ్ పంపడంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తి.. ఇద్దరూ నడిరోడ్డుమీదే గొడవపడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలికల స్నేహితులు కూడా వారికి జతకూడారు. దీంతో.. వారందరూ రెండు గ్రూపులుగా విడిపోయి జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. కాగా.. ఈ వ్యవహారం మొత్తం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో వారు స్టూడెంట్స్‌ను విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement