Thursday, May 16, 2024

అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపేయండి.. ఏపీ, తెలంగాణ‌కు కేఆర్‌ఎంబీ ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రాజెక్టుల నిర్వహణన బాధ్యతలను బోర్డులు అప్పగించాలని కేంద్ర జలశక్తిశాఖ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గడువు జులై 15తో ముగియడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. అనుమతుల్లోని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ విషయమై రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు శుక్రవారం బోర్డు లేఖ రాసింది. లేఖలో ప్రధానంగా అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను చేపట్టొద్దని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు డీపీఆర్‌లు సమర్పించని ప్రాజెక్టుల కు అనుమతులు తీసుకోవాలని కేంద్ర జలశక్తిశాఖ తెలుగు రాష్ట్రాలకు గడువు ఇచ్చింది. ఆ గడువు ఈ నెల 13తో ముగిసింది. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేయాలని ఆదేశిస్తూ బోర్డు… ఏపీ, తెలంగాణకు లేఖలు రాసింది.

అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాల పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయని ఈ సందర్భంగా కేఆర్‌ఎంబీ పేర్కొంది. గతేడాది జులై 15న కేంద్ర జలశక్తిశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం రెండు రాష్ట్రాలు అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపేయాలని తెలిపింది. ఆదేశాలపై తగిన నివేదికలు ఇవ్వాలని నిరుడు జులైతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రెండు రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు గుర్తు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై చాలా వివాదాలు ఉన్నాయని బోర్డు తెలిపింది. రెండు ప్రాజెక్టులకు 15 కాం పోనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం కుదిరిందని గుర్తు చేసింది. 15వ కేఆర్‌ఎంబీ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు కాంపోనెంట్ల స్వాధీనానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. బోర్డు తీసుకున్న కీలక నిర్ణయం అమలైతే వివాదాస్పద అంశాలన్నింటికీ పరిష్కారం లభించనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement