Tuesday, March 26, 2024

Telangana | బీజేపీ నేత కారుపై రాళ్ల దాడి.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘ‌ట‌న‌

నిజామాబాద్, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జి మీసాల చంద్ర‌య్య కారుపై ఇవ్వాల సాయంత్రం రాళ్ల‌దాడి జ‌రిగింది. దీంతో ఆయ‌న దాడులకు భయపడేది లేదని, దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశానికి ఆయ‌న హాజరయ్యారు. సమావేశం ముగిసిన త‌ర్వాత హైదరాబాద్ వెళ్తుండగా మాధవ నగర్ సాయిబాబాగుడి దగ్గర (సాయంత్రం) చంద్రయ్య కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

ఈ దాడితో ఆయ‌న కారు వెనుక భాగం అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సందర్భంగా మాధవ్‌న‌గర్ వద్ద విలేకరులతో ఆయ‌న మాట్లాడారు. తాను హైదరా బాద్ వెళ్లుండ‌గా మార్గ మధ్యలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ త‌న కారుపై రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. వాహనానికి ముందు భాగంలో బీజేపీ జెండా ఉండడంతోనే తనపై దాడి చేసినట్లు ఆయన చంద్ర‌య్య‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement