Friday, May 17, 2024

WPL | చలరేగిన స్మృతి మంధాన.. యూపీ ముందు భారీ టార్గెట్ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో భాగంగా ఇవ్వాల జ‌రిగిన మ్యాచ్ లో ఆర్‌‌సీబీ బ్యాటర్లు రఫ్పాడించారు. సిక్స్‌లు ఫోర్లతో యూపీ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగ‌గులు చేసి యూపీ ముందు భారీ టార్గెట్ ను సెట్ చేశారు.

ఆర్‌‌సీబీ సారధి స్మృతి మంధాన (50 బంతుల్లో 80 పరుగులతో), ఎల్లీస్ పెర్రీ (37బంతుల్లో 58పరుగులతో) హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఇక‌, సబ్భినేని మేఘన (28), రిచా ఘోష్ (నాటౌట్ 21 ) తో ఆకట్టుకున్నారు. ఇక యూపీ బౌలర్లలో అంజలి సర్వాణి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement