Sunday, April 28, 2024

ఇరాక్ లోని అమెరికా మిల‌ట‌రీ క్యాంప్ పై రాకెట్ల‌తో దాడి..

బాగ్ధాద్‌ : ఇరాక్‌లోని అమెరికా మిలటరీ క్యాంపుపై గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారన్న సమాచారం ఇంతవరకు అందుబాటులో లేదు. నేటి ఉదయాన్నే పది రాకెట్లు ఒక్కసారిగా బాంబులతో దాడిచేసినట్లు స‌మాచారం..7.20 గంటలకు ఒక్కసారిగా పది రాకెట్లు గర్జిస్తూ వచ్చి యూఎస్‌ బేస్‌ క్యాంపుపై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రాకెట్లు బాంబులు జారవిడిచి పారిపోయాయి. ఈ దాడిని అమెరికా, ఇరాక్‌ భద్రతా దళాలు ధ్రువీకరించాయి. డజన్‌కు పైగా రాకెట్లు క్యాంప్ పై ప‌డిన‌ట్లు పెంటగాన్‌ పేర్కొన్నది. ఓఏఆర్‌ అధికార ప్రతినిధి కూడా దాడి నిజమే అని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇరాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. బాంబు దాడులకు ఇంతవరకు ఏ సంస్థగానీ, వ్యక్తులు గానీ బాధ్యత అని ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement