Wednesday, May 1, 2024

RIP – కొత్తకోట మృతికి చంద్రబాబు సంతాపం

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే కొత్తకోట మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ నుంచి దయాకర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్ది కాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న దయాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ప్రాణాలు విడిచారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలియజేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమర్థుడైన నాయకుడుగా దయాకర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దయాకర్ రెడ్డి మృతి బాధాకరమన్నారు. పార్టీకీ ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలందించారన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సీమాంధ్రులతో దయాకర్ రెడ్డి తోడ బుట్టిన సోదరుడిలా వ్యహరించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement