Monday, May 6, 2024

Imphal : మణిపూర్​లో 11 కేంద్రాలలో రీపోలింగ్

19న జరిగిన పోలింగ్ లో ఈవిఎంలు ధ్వంసం
దీంతో మొత్తం 11 కేంద్రాలలో పోలింగ్ రద్దు
రేపు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం

లోక్‌సభ తొలిదశ ఎన్నికలు ఈ నెల 19న ముగిశాయి. ఇందులోభాగంగా ఇన్నర్ మణిపూర్ లోక్ సభ నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడిన దుండగులు కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలకు పాల్పడ్డారు.

- Advertisement -

దీంతో ఆ 11 పోలింగ్ కేంద్రాల్లో రేపు రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ) నిర్ణయించింది. ఈమేరకు మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ప్రకటించారు. తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 19న ఈ స్టేషన్లలో జరిగిన ఎన్నికలు శూన్యమని, లెక్కలోకి తీసుకోలేదని వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement