Monday, May 13, 2024

భారీగా పెరిగిన దుబాయ్ విమాన చార్జీలు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజురోజుకు కేసుల సంఖ్య కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత విమానాలపై ఆంక్షలు విధించాయి. అదే క్రమంలో యూఏఈ కూడా భారత విమానాలపై నిషేధం విధించింది. ఆదివారం నుంచి ఆ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

కరోనా కేసులు పెరిగిపోతుండడంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారు త్వరత్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. యూఏఈకి విమానాలు బంద్ అయ్యే లోపే అక్కడకు వెళ్లిపోవాలనుకుంటున్న వారు.. ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రైవేట్ జెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముంబై నుంచి దుబాయికి వన్ వే ప్రయాణం కోసం శుక్రవారం, శనివారాల్లో చార్జీ రూ.80 వేలుగా ఉంది. ఇది మామూలు రోజులతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. అదే న్యూఢిల్లీ నుంచి దుబాయ్ కు రూ.50 వేలు వసూలు చేశారు. మామూలు రోజులతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ప్రైవేట్ జెట్లకు డిమాండ్ అమాంతం పెరిగిందని ఎయిర్ చార్టర్ సర్వీస్ ఇండియా ప్రతినిధి చెప్పారు. శనివారం తమ సంస్థ నుంచి 12 విమానాలు దుబాయ్ కు వెళ్తున్నాయని, ప్రతి విమానం నిండిపోయిందని చెప్పారు. ఇక కొంతమంది అయితే ఏకంగా ఓ గ్రూపుగా ఏర్పడి చార్టర్ ను బుక్ చేసుకుంటున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement