Friday, April 19, 2024

కొవిడ్‌ సమయంలో విడుదలైన ఖైదీలు సరెండర్‌ అవ్వాలి.. ఆదేశించిన సుప్రీంకోర్టు

కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో విడుదలైన ఖైదీలు, అండర్‌ ట్రయల్‌ ఖైదీలందరూ 15 రోజుల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. మహమ్మారి సమయంలో జైళ్లలో కొవిడ్‌ సంక్రమణను తగ్గించే ప్రయత్నం జైళ్ల నుంచి విడుదల అయ్యారు. మహమ్మారి సమయంలో అత్యవసర బెయిల్‌పై విడుదలపైన అండర్‌ ట్రయల్‌ ఖైదీలు లొంగిపోయిన తర్వాత సమర్ధ న్యాయస్థానాల ముందు రెగ్యులర్‌ బెయిల్‌ కోసం వెళ్లవచ్చని న్యాయమూర్తులు ఎంఆర్‌ షా, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. లొంగిపోయిన తర్వాత ఖైదీలు తమ శిక్షను సస్పెండ్‌ చేసేందుకు సమర్ధ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement