Saturday, April 27, 2024

Delhi: సికింద్రాబాద్ ఘటనపై ప్రధాని విచారం.. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో పలువురు మృతి చెందడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement