Saturday, April 27, 2024

అనారోగ్యానికి గురైన ప్ర‌భాస్.. షూటింగ్స్ కి విరామం

వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌..కాగా రీసెంట్ గా ఆయ‌న అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు స‌మాచారం. అందుకే అన్ని షూటింగులకు ప్యాకప్‌ చెప్పి ఇంటికి వెళ్లినట్లు సినిమా వర్గాల సమాచారం.. కాగా ఈ నెలలోనే మారుతి సినిమా కొత్త షెడ్యూల్‌ హైద‌రాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణమంతా పాల్గొనాల్సింది. అయితే ప్రభాస్ జ్వరం బారిన పడడంతో షెడ్యూల్‌ మొత్తాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్‌ అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ఆరోగ్యం బాగానే ఉందని, ఫ్యాన్స్‌ కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్‌ సన్నిహితులు చెబుతున్నారు. విరామం లేకుండా వరుస సినిమా షూటింగ్సులలో పాల్గొనడం వల్లే అనారోగ్యం బారిన పడ్డారని, త్వరలోనే సినిమా షూటింగులకు హాజరవుతార‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement