Saturday, July 27, 2024

PM MODI:  ఇవాళ ఒడిశాలో ప్రధాని  మోడీ పర్యటన

ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ  ఒడిశాలో పర్యటించనున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.  మధ్యాహ్నం  బరిపాడలోని ఛౌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత  బాలాసోర్‌లో,   కేంద్రపరాలో జరిగే బహిరంగ సభల్లో మోడీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.

- Advertisement -

అయితే, నేటి ఉదయం  ఖుషీనగర్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయం సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం  డియోరియాకు చెందిన బాబా రాఘవదాస్ ఇంటర్ కళాశాలలోని భట్‌పరాని మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక, చివరగా మధ్యాహ్నం 1:50 గంటలకు గోరఖ్‌పూర్‌లోని మురారీ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు గోరఖ్‌పూర్‌లోని బన్స్‌గావ్‌లోని సర్వోదయ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ పార్టీ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement