Sunday, May 5, 2024

National : జమ్మూలో ప్రధాని మోదీ పర్యటన….13,375 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం

ప్రధాని మోదీ ఇవాళ జమ్మూలో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులను ప్రారంభోత్సవం ప్రారంభించునున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. నేటి సాయంత్రం వరకు క్రాకర్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

కాగా, దాదాపు రూ.13,375 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. నేటి ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను సైతం అధికారులు నిషేధించారు. ఇదిలా ఉండగా జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు. దీంతో పాటు ఈ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్మూ – కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ- అమృత్‌సర్- కత్రా ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement