Sunday, April 28, 2024

National : ఇవాళ బీహార్​లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బీహార్‌లో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలు బీజేపీ సాధించాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళలో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించారు. వరస పర్యటనలతో బీహార్‌లో కూడా లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే మూడు సార్లు ప్రచారం నిర్వహించిన నరేంద్ర మోదీ నేడు మరొకసారి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గయా గాంధీ మైదానంలో మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో ఆయన ప్రసంగించిన అనంతరం పూర్నియాలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement