Sunday, May 19, 2024

Pakistan : లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోరం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 10 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

30 మంది ప్రయాణికులతో కూడిన ఓ బస్సు రావల్పిండి నుంచి గిల్గిట్ పాల్టిస్థాన్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో డయామర్ జిల్లాలోని కారకోరం హైవే వద్దకు రాగానే.. అదుపుతప్పి లోయలో పడింది. గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement