Friday, May 17, 2024

‘సుప్రీం కోర్టు’లో శ్రీల‌క్ష్మికి చుక్కెదురు..

ఏపీ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీల‌క్ష్మికి సుప్రీం కోర్టులో చుక్కెదుర‌యింది. ఏపీ,క‌ర్నాట‌క స‌రిహ‌ద్దు వివాదం తేలేంత‌వ‌ర‌కూ త‌న‌పై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై ద‌ర్యాప్తును నిలిపివేయాల‌ని శ్రీల‌క్ష్మి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కేసు విచార‌ణ‌ను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగ‌దీస్తుందంటూ వాదించారు శ్రీల‌క్ష్మి త‌ర‌పు న్యాయ‌వాది రంజిత్ కుమార్. అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని లాయర్ ..కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా గ‌తంలో శ్రీల‌క్ష్మి పిటిష‌న్ ను హైకోర్టు తోసిపుచ్చింది.తాజాగా శ్రీలక్ష్మి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement