Saturday, May 18, 2024

వాగును తలపిస్తున్న జాతీయ రహదారి.. వరుద ఉధృతిని పరిశీలిస్తున్న సీతక్క

ములుగు, (ప్ర‌భ న్యూస్‌) : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో ఉన్న ములుగు-ఏటూరు నాగారం జాతీయ రహదారి వాగును తలపిస్తోంది. దీంతో ఎగువ నుండి వస్తున్న నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి.

విషయం తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘటనా స్థలానికి చేరుకుని వరుద ఉధృతిని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement