Friday, May 3, 2024

‘లైగర్’ సెట్‌లో ప్రత్యక్షమైన బాలయ్య

యువ హీరోల్లో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా నత్తనడకన సాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుండగా, సడెన్‌గా బాలకృష్ణ సెట్లో ప్రత్యక్షం అయ్యారు. పూరీ, ఛార్మీ, విజయ్ ఆయనతో కలిసి ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ మేరకు నందమూరి బాలకృష్ణ సర్ ప్రైజ్ విజిట్ చేసి టీం అందరిని ఆశీర్వదించారంటూ చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. కాగా లైగర్ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ మిక్స్‌డ్ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement