న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండ్ కమిటీ సభ్యులుగా బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లోని ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్ 269లోని సబ్-రూల్ (1) ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ కామర్స్కు నామ నాగేశ్వరరావును సభ్యునిగా నామినేట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement