Thursday, May 16, 2024

WPL | ఆర్‌‌సీబీపై ముంబై విజయం..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు విజయం సాధించింది. ఆర్‌‌సీబీపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది ముంబై జట్టు. ఇక వ‌రుస‌గా రెండో ఓట‌మితో ఆర్సీబీ నాలుగవ స్థానానికి పడిపోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. దీంతో 132 పరుగుల టార్గెట్‌తో ముంబై జట్టు బరిలోకి దిగింది. ఇక చేజింగ్‌లో ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెన‌ర్లు హేలీ మాథ్యూస్(26), య‌స్తికా భాటియా(31) బౌండ‌రీల‌తో విరుచుకు ప‌డ్డారు. ఆ త‌ర్వాత సీవ‌ర్ బ్రంట్(27), అమేలియా కేర్ (40 నాటౌట్)లు కీల‌క భాగ‌స్వామ్యం నెలకొల్పి జ‌ట్టును గెలుపు దిశ‌గా న‌డిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement