Monday, April 15, 2024

Sports | ఇండియ‌న్ ఓపెన్ బ్యాడ్మింటన్​ టోర్నీలో మిశ్ర‌మ ఫ‌లితాలు.. సింధు ఔట్‌.. సైనా విన్‌

ఇండియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలోని కేడీ జాదవ్‌ హాల్‌లో మంగళవారం జరిగిన గేమ్‌లో ఇద్దరు టాప్‌ షట్లర్లలో ఒకరు ఓటమి చెందగా, మరొకరు విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. ఆగస్ట్‌లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో గాయం కారణంగా 2022 సీజన్‌ మొత్తం ద్వితీయార్థాన్ని కోల్పోయిన సింధు, 21-14, 22-20 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కాటెథాంగ్‌తో వరుస గేమ్‌లలో ఓడిపోయింది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆడిన 77 ర్యాలీలలో సుపానిడా 43 గెలిచింది.

ఆమె మొదటి గేమ్‌లో ప్రారంభంలోనే స్థిరపడి పైచేయి సాధించగలిగింది. రెండో గేమ్‌లో 17-13 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సింధు 20-20తో స్కోర్‌లను సమం చేయడంతో చివరి రెండు పాయింట్లను గెలుచుకోవడం ద్వారా సుపానిడా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సైనా మూడు గేమ్‌లలో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌పై సైనా నెహ్వాల్‌ వరుస సెట్లలో విజృంభించింది. కేవలం గంట వ్యవధిలో 21-17, 12-21, 21-19తో విజయం సాధించింది.సైనా సానుకూల నోట్‌తో ప్రారంభించింది. ఓపెనింగ్‌ గేమ్‌లో 11-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అయినప్పటికీ, బ్లిచ్‌ఫెల్డ్‌ రెండవ గేమ్‌లో పుంజుకుంది. అయితే, సైనా తన ప్రత్యర్థి యొక్క అటాకింగ్‌ స్ట్రోక్‌లను ఎదుర్కొనేందుకు దాడికి దిగి, మ్యాచ్‌ను ముగించడానికి మోసపూరిత నెట్‌ షాట్‌తో ముందుకు వచ్చి సత్తాచాటింది. తదుపరి రౌండ్‌లో చైనాకు చెందిన చెన్‌ యుఫీతో సైనా నెహ్వాల్‌ తలపడనుంది. లక్ష్య సేన్‌, సత్విసాయిరాజ్‌ రంకిరెడ్డి/చిరాగ్‌ శెట్టి, ట్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్‌ పుల్లెల, కృష్ణ ప్రసాద్‌ గరగ/విష్ణువర్ధన్‌ గౌడ్‌ పంజాల కూడా తదుపరి దశకు చేరుకున్నారు. అయితే, సింధు, ప్రణయ్‌తో పాటు, మ#హళల డబుల్స్‌ జోడీ శృతి మిశ్రా/సిక్కి రెడ్డి, మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ ఇషాన్‌ భట్నాగర్‌/తనీషా క్రాస్టో, మ#హళల డబుల్స్‌ జోడీ #హరిత మనజియిల్‌, అష్నా రాయ్‌ జోడీ తొలిరోజునే ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement