Friday, May 3, 2024

గడ్డం పెంచిన ప్రతివాడు గబ్బర్ సింగ్ కాలేడు…పేర్ని

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ద్వజమెత్తారు పేర్ని నాని. ఒక ఆడపిల్ల పై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే పనిలో ఉన్నారని నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. మేము చర్యలు తీసుకోకపోతే తప్పు… కానీ వాళ్లని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నప్పటికీ నారా లోకేష్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. వైయస్ జగన్ పరిపాలన లో మహిళలకు ఎంతో రక్షణ ఉంటుందని అన్నారు. నారా లోకేష్ రాజకీయ నిరుద్యోగి అని ఇప్పుడు ఉద్యోగం కోసం తాపత్రయ పడుతున్నారు అని ఆరోపించారు.

జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమో అన్న భయంతో విచక్షణ మరచి లోకేష్ మాట్లాడుతున్నారని నాని అన్నారు. పదిమందితో చప్పట్లు కొట్టించుకోవడం కాదు ఐదు కోట్ల ఆంధ్రుల తో చప్పట్లు కొట్టించుకోగలగాలి. లెక్కలు తీయటం మొదలు పెడితే కక్ష సాధింపు అంటారు. గడ్డం పెంచిన ప్రతివాడు గబ్బర్ సింగ్ కాలేడు… అంటూ పంచ్ డైలాగులు వేశారు పేర్ని.

Advertisement

తాజా వార్తలు

Advertisement