Thursday, May 9, 2024

ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ పరామర్శ..

జనగామ, ప్రభన్యూస్ : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాతృమూర్తి తాటికొండ లక్ష్మీ ఇటీవల స్వర్గస్తురాలైనందున బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసాన్ని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖామంత్రివర్యులు కేటీఆర్ సందర్శించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాతృమూర్తి తాటికొండ లక్ష్మీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డా.రాజయ్యతో పాటు తమ సోదరుడు సురేష్, కుటుంబ సభ్యులను పరామర్శించారు..అనంతరం ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతు బంధుసమితి చైర్మన్ & ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , ఎంపీ మాలోతు కవిత , ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ , జిల్లా పరిషత్ చైర్మన్ లు పాగాల సంపత్ రెడ్డి , కుసుమ జగదీశ్, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఎంపీపీలు , జడ్పీటీసీలు ,మండల పార్టీ అధ్యక్షులు , ముఖ్యనాయకులు , సర్పంచులు , ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement