Wednesday, May 1, 2024

అకాల వర్షాల ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన‌ మంత్రి గంగుల

ప్రకృతి వైపరీత్యం చూపుతుందేమో కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షానే నిలబడుతుందన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్..కాగా నిన్న శనివారం కురిసిన రాళ్ల వాన, అకాల వర్షాలతో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పంట నష్టపోయిన కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ స్థానిక యంత్రాంగంతో క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించి రైతులలో పూర్తి భరోసా నింపారు. గతంలొ కాలి గాయంతో మూడువారాలు పూర్తి రెస్టులో ఉండాలని డాక్టర్లు సూచించినప్పటికీ కేసీఆర్ ఆదేశాల‌తో, ప్రకృతి .. ప్రకోపంతో తల్లడిల్లుతున్న రైతులకు భరోసా ఇవ్వడంకోసం పంట నష్టపోయిన ప్రాంతాలకు వచ్చానని, ఏ రైతు అధైర్య పడొద్దని, సీఎం కేసీఆర్ నేత్రుత్వంలోని రైతు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు మంత్రి . నష్టపోయిన ప్రతీ అంగుళానికి, ప్రతీ పంటకు ఖచ్చితమైన పరిహారం అందజేస్తామన్నారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాదర, హుజురాబాద్ మండలాలతో పాటు, కరీంనగర్ గ్రామీణంలోని చమాన్ పల్లి, తాహెర్ కొండాపూర్, ఫకీర్ పేట్, జూబ్లీ నగర్, చెర్లబూత్కూరు, ముగ్దుంపూర్ తదితర ఆరు గ్రామాల్లో 5వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగి కనీసం కిలో కూడా చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ గ్రామాల్లోనే దాదాపు 3144 ఎకరాలు నష్టపోయాయని ప్రాథమిక అంచనాలను అధికార యంత్రాంగం వేసిందన్నారు. స్థానికంగా తనకున్న మూడెకరాలతో పాటు మరో 25ఎకరాలు కౌలు చేసిన స్థానిక రైతు లక్ష్మయ్యకు గింజ ధాన్యం కూడా దక్కని పరిస్థితికి ఆవేదన చెందిన గంగుల పూర్తిగా అండగా ఉంటామని ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని భరోసా నింపారు. కేసీఆర్ రైతుల్లో భరోసా నింపేలా నీళ్లు, ఉచితకరెంటు, మౌళిక వసతులు, రైతుబందు, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడంతో తెలంగాణ రైతులో భరోసా పెరిగిందని, గతంలో కన్నా ఎన్నో రెట్లు అధికంగా పంటను పండిస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతు, ప్రభుత్వం నిలిచిందన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని సివిల్ సప్లైస్ శాఖను అదేశించామన్నారు. వాటిని అవసరమైతే బాయిల్డ్ రైస్ చేయాలని ఆదేశించారు.ఈ పర్యటనలో మంత్రితో పాటు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement