Friday, May 17, 2024

సంపూర్ణ ఆరోగ్యానికి పాలు మేలు .. నేడు ప్రపంచ పాల దినోత్సవం ..

పాలలో మనిషి శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు వున్నాయి. చంటి పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ ఆరోగ్యంగా వుండటానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా వుండాలంటె ప్రతి రోజు 284 గ్రాముల పాలు తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహా రం పాలు.ప్రతి సంవత్సరం జూన్‌ 1 న ప్రపంచ పాల దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2001 సంవత్సరం లో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌. ఏ.ఓ) నిర్వహించింది. పాలను ప్రపంచ ఆహారంగా పాడి రంగంలో అనుసంధానించబడినదిగా పాల దినోత్సవాన్ని అనేక దేశాలు జరుపుకొంటున్నాయి. ఒక బిలియన్‌ పైగా ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పాల ఉత్పత్తుల రుచి ప్రదర్శనలు, సెమినార్లు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ ఆహారంగా పాల ప్రాముఖ్యతను తెలిపేం దుకు పాడిరంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐక్యరాజ్య సమితి ఆహారం మరియు వ్యవసాయ సంస్థ ప్రపంచ పాల దినోత్సవం జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. పాలు సంపూర్ణ ఆహారం, సహజమైన పదార్థం, పాల నుండి జున్ను , వెన్న, పెరుగు, నెయ్యి, ఐస్‌క్రీం, కేకు, స్వీటు వంటి పదార్థాలు లభిస్తాయి. పాలు మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్‌ ఎ, విటమిన్‌ డి, ప్రోటీన్‌, వంటి ఆరోగ్య కరమైన కొవ్వుల వంటి పోషకాలకు, అద్భుతమైన మూలం.

పాలు శరీరానికి తక్షణ శక్తిని స్తుంది. ఎదిగే పిల్లలకు, క్రీడాకారుల కు, ఎంతో పోషక విలువలు అందుతాయి. పాలు కండరాల మరియు ఎముకల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్లు కేల్షియం, సమృద్దిగా అందిస్తాయి. భారతదేశ గ్రామీణ ప్రజలలో ఉన్న నమ్మకం ప్రకారం పల్లె ప్రజలు కల్తీ లేని అసలు సిసలైన స్వచ్చమైన పాలను పొందుతారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారనే విశ్వాసం. కల్తీ పాలు ఒక మోసపూ రితమైన చర్యల ద్వారా తయారుచేసి అమ్ముతున్నారు. అయితే పాలు పాల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించటం కోసం నేషనల్‌ డైరీ డెవలప్‌ మెంట్‌ బోర్డు అనేది పాలు, పాల పరిమాణాన్ని పరిశీలిస్తువుంది. కానీ దేశంలో ఎక్కువ లేకపోవడం వల్ల వినియోగ దారులు నష్ట పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులు సేవించేవారు సుమారు 600 కోట్ల మందికి పైగా ఉన్నారు. పాలను బాగా వేడి చేసిన తర్వాత తాగాలి. ఎక్కువ సమయం వేడి చేసినా పోషకాలు కొంత మేర కోల్పోతాయి. పాలలో ఆవు పాలు శ్రేష్టమైనవి.

పాలలో విటమిన్‌ డి, భాస్వరం, విటమిన్‌ బి-12, విటమిన్‌ ఎ, నియాసిన్‌, లాక్టోస్‌, కార్బోహడ్రేట్స్‌, పొటాషియం, కొవ్వులు, వంటి పోషకాలు లభిస్తాయి. వీటి వలన ఎముకల నిర్మాణం, శక్తి, ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, దృష్టి, చర్మ సంబంధ వ్యాధులు రాకుండా తోడ్పడును. చెక్కర, కొవ్వు పదార్థాలు తయారగును. వయస్సు రీత్యా అధిక మోతాదు లో తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి బ్లడ్‌ ప్రెష ర్‌, రక్తపోటు, వచ్చే ప్రమాదం ఉంది. లాక్టోస్‌ అనే పదార్థం వలన డయాబెటీస్‌, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. పాలలో పిండి పదార్థాలు, డిటర్జెంట్‌ పౌడర్‌ మిశ్రమం చేస్తారు ,అందుకు మనం పాలను వెడి చేస్తున్నపుడు కొన్ని చుక్కల అయోడిన్‌ వేస్తే పాలు నీలం రంగుకు మారితే కల్తీ పాలుగా గుర్తించవచ్చును. వ్యవసాయ రంగానికి అను బంధంగా పాడి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి.యంత్రాల వినియోగం వల్ల ఈ రంగం ప్రాధాన్యం తగ్గింది. వాస్తవం గా వ్యవసాయానికి సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గి క్రిమి సంహారక మందులు ప్రాధాన్య త ఇస్తున్న ఈ రోజుల్లో దిగుబడి తగ్గుతున్నది. అందుకు ప్రభు త్వాలు పాడిరంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement