Thursday, April 25, 2024

TS: మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహాను క‌లిసిన మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి నీలం మ‌ధు ముదిరాజ్

ఉమ్మడి మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాను మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హైదరాబాదులోని మినిస్టర్ క్వాటర్స్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనను మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సహకరించిన మంత్రి దామోదర్ కు రుణపడి ఉంటానన్నారు.

ఇందిరా గాంధీ లాంటి మహానేత ప్రాతినిధ్యం వహించిన ఈ గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి దామోదర్ సలహాలు, సూచనల మేరకు ఆయన మార్గదర్శకత్వంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లి మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement