Wednesday, May 1, 2024

వివాహిత ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా?

వాజేడు, (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండలంలో ఓ వివాహిత ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కృష్ణాపురం గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పేట అనిత (20)కు రెండు నెలల క్రితం భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామానికి చెందిన రమేశ్‌తో వివాహం జరిగింది. ఈ మ‌ధ్య‌ భర్తతో గొడవపడి త‌న తల్లిగారి గ్రామమైన కృష్ణాపురం వచ్చింది. సోమవారం ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. త‌న ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను రెండు పేజీలలో లేఖలో వివ‌రంగా రాసిన‌ట్టు సమాచారం.

కాగా, భర్త వేధింపులు తాళలేకనే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేకలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. వివాహిత ఆత్మహత్యకు అసలైన కారణాలు ఏంటనేది పోలీసుల ద‌ర్యాప్తులో తెలియాల్సి ఉంది. పెళ్లయిన కొద్ది నెలలకే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement