Wednesday, May 1, 2024

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. ఆర్థిక సమస్యలే కారణం

కాజీపేట (ప్రభ న్యూస్) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లా​ కాజీపేట రైల్వే జంక్షన్ పరిధి మెట్టుగుట్ట శివారులో శనివారం మధ్యాహ్నం జరిగింది. కాజీపేట జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడికొండకు చెందిన మోడెం ప్రసాద్ (35) వెల్డింగ్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా వెల్డింగ్ దుకాణం నడవక పోవడంతో అప్పుల పాలయ్యాడు.

దీంతో మానసికంగా క్రుంగిపోయి జీవితంపై విరక్తి చెందిన ప్రసాద్ మడికొండ మెట్టుగుట్ట సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement