Saturday, May 18, 2024

అధికార పార్టీ దాడుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటాం : బండి సంజయ్

తమపై దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేత‌ల భేటీలో ఆయ‌న మాట్లాడుతూ… బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి.. బీజేపీ కార్యకర్తలపై దాడులను ప్రేరేపిస్తున్నాడన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన బెట్టుకున్న కేసీఆర్.. ఉద్యమకారులను పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement