Tuesday, May 14, 2024

విద్వేషాలను విడనాడి.. విశ్వశాంతిని సాదిద్ధాం.. కేసీఆర్

మనం విద్వేషాలను విడనాడి.. విశ్వశాంతిని సాదిద్ధామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం మాట్లాడుతూ…. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయన్నారు. తమ ప్రయోజనాల కోసం విద్వేషపు మంటలు రగిలిస్తున్నాయన్నారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈనేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement