Thursday, April 25, 2024

National : హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో విరిగిప‌డ్డ కొండ‌చరియ‌లు.. ఇద్ద‌రు మృతి…

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ తొక్కిస‌లాట చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెందారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న హోలా మొహల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

మేడిలో హోలీకి మొహల్లా వేడుక జరుగుతుండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. తొమ్మిది మందికి గాయాలు… ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, గాయలాలపాలయైన వారిని ఉనా ఆసుపత్రికి తరలించారు. చరణ‌ గగావద్ద హోలీ రోజున స్నానాలు చేస్తుండగా కొండచరియలు విరిగిపడటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement