Sunday, April 28, 2024

National : గ్రామీణ భార‌త్ బంద్ ….స్థంభించనున్న జాతీయ రహదారులు..

దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర కి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇవాళ‌ గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

తమ సమస్యలను ప్రజలకు వివరించి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడించింది. ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు సపోర్ట్ ఇచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులను స్తంభింపజేస్తామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement