Friday, April 26, 2024

కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని… ఏంచేశాడో తెలుసా..

ప్ర‌భ‌న్యూస్ : కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని సొంత చెల్లిని గొడ్డ‌లితో దాడి చేసి త‌ల న‌రికేశాడు. శ‌రీరం నుంచి త‌ల‌ను వేరుచేశాడు ఓ సోద‌రుడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువ‌తి వైజాపుర్‌లోని ల‌డ్గావ్‌కు చెందిన వ్య‌క్తితో ప్రేమ‌లోప‌డింది. ఆరు నెల‌ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని ల‌డ్గావ్‌లో కాపురం పెట్టారు. విష‌యం తెలుసుకున్న కుటుంబీకులు యువ‌తికోసం అన్వేషించారు. ఇదే స‌మ‌యంలో త‌ల్లికి యువ‌తి తార‌స‌ప‌డింది. ఇద్ద‌రూ యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. యువ‌తి ఫోన్ నంబ‌ర్ తీసుకుంది.

ఆదివారంనాడు ఆ త‌ల్లి, కొడుకును తీసుకుని కూతురు నివాస‌ముంటున్న ల‌డ్గావ్ వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి సోద‌రిని చూసిన వెంట‌నే ర‌గిలిపోయిన సోద‌రుడు కొడ‌వ‌లితో దాడిచేశాడు. ఆమె త‌ల‌ను న‌రికి… శ‌రీరం నుంచి వేరుచేశాడు. ఈ ఘ‌ట‌న‌తో నిర్ఘాంత‌పోయిన ఆయువ‌తి భ‌ర్త అక్క‌డి నుంచి పారిపోయాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని నిందితుడిని, అత‌డి త‌ల్లిని అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement