Wednesday, May 1, 2024

Kejriwal: నేను విచార‌ణ‌కు రాను… మరోసారి ఈడీ విచారణ దూరం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరవనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రాలేనని ఆయన ఈడీ అధికారులకు సమాచారం అందించారు.

ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు రాలేనని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీకి సమాచారం పంపారు. ప్రతిసారి ఒక్కో కారణం చెబుతూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉంటున్నారు. మొదటి రెండుసార్లు ఎన్నికల ప్రచారంలో ఉన్నానని విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్ తనకు నోటీసులు ఇవ్వడం తప్పని. వాటిని వెనక్కి తీసుకోవాలని లేఖ రాశారు. తాజాగా ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉండగా పార్టీ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో రాలేనని ఈడీ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement