Friday, April 26, 2024

దేశానికి, రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్ రూరల్, ప్రభ న్యూస్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి సంక్షేమ పథకాలకు, బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం చౌట్పల్లికి చెందిన బీజేపీ, బీఎస్పీ పార్టీల నుండి పలువురు ఆదివారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రోజురోజుకు దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా కావాలనే డిమాండ్ ప్రజల్లోంచి వస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
పార్టీలో చేరిన వారు..
కొమ్ముల వెంకన్న, కొట్టాల రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, బేల్దారి సందీప్, బేల్దారి ప్రవీణ్, వంజరి గణేష్, ఏలేటి రాంచందర్, కుర్మా మహేష్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారు శంకర్,పార్టీ ప్రెసిడెంట్ అరెల్లి నవీన్,మాజీ సర్పంచ్ రాజన్న,కొమ్ముల రాజేందర్,బట్టు అశోక్,రాజేశ్వర్,సుమన్,రజిత,మహేష్,ముతేన్న,తోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement