Wednesday, May 15, 2024

Delhi | హస్తినలో ‘కాంతితో క్రాంతి’.. కొవ్వొత్తులతో నారా లోకేష్ నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ తలపెట్టిన ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఢిల్లీలోని అశోక రోడ్‌లో ఉన్న తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలంటూ నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

- Advertisement -

ఇందులో భాగంగా విద్యుత్ దీపాలను ఆర్పేసి బయటకొచ్చిన నేతలు కొవ్వత్తులు చేతబట్టి నిరసన తెలిపారు. లోకేష్‌తో పాటు ఈ నిరసన ప్రదర్శనలో వైఎస్సార్సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణతో పార్టీ నేతలు, ఢిల్లీలోని కొందరు తెలుగు ప్రజలు పాల్గొన్నారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని నినదించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement