Tuesday, April 23, 2024

కళాతపస్వి విశ్వనాధ్ మృతి పట్ల ఎన్టీఆర్ దిగ్బ్రాంతి

కళాతపస్వి విశ్వనాధ్ మృతి పట్ల ఎన్టీర్ దిగ్బ్రాంతి చెందాడు. ఆయన మరణ వార్త విని సినీ ప్రపంచం శోక సముద్రంలో మునిగి పోయింది అని అన్నారు .

“తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు తారక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement